తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.  ఇప్పటికే తెలుగు లో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ కి రెడీ అవుతుంది.  ఈ సీజన్ మి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ గత సీజన్లు పూర్తయిన తర్వాత సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తే..బిగ్ బాస్ 3 షో కి ముందు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది.   

బిగ్‌బాస్ సీజ‌న్ 3  ఆదివారం (జూలై 21) ప్రారంభం కానుంది..ఈ షోకు అక్కినేని నాగార్జున వాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు..బిగ్‌బాస్ షో పై చాలా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  యాంకర్ శ్వేతారెడ్డి, న‌టి గాయ‌త్రి గుప్తా బిగ్‌బాస్ పై పోలీసు కంప్ల‌యింట్ చేసారు.. ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ధ‌ర్నా కూడా చేసారు.. మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేసారు.

రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జ‌రుగుతుంద‌ని, స‌భ్యుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌నీ ఈ షో ఆపాల‌నీ చేస్తున్న ఆందోళ‌న‌ల‌లో భాగంగా ఉస్మానియా విద్యార్థులు తోడ‌య్యారు.. ఈ షో ఆప‌ని ప‌క్షంలో నాగార్జునకు చెందిన అన్న‌పూర్ణ స్డూడియోస్ ను ముట్ట‌డించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టుగా స‌మాచారం... రెమ్యూన‌రేష‌న్ తీసుకుని న‌టించే ఆర్టిస్టుల‌కు షో ఆపే హ‌క్కు ఉంటుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: