ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంభినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.  మొన్న విడుదలైన ఈ చిత్రం యావరేజ్  టాక్ ను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో దూసుకుపోతుంది.  కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. 


ముఖ్యంగా ఈ సినిమా నైజాం లో అదరగోడుతుంది.  ఈచిత్రం అక్కడ 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా  కేవలం రెండు రోజుల్లో నే 5.4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి  ప్రీ రిలీజ్ బిజినెస్ లో 83శాతం  రికవరీ చేసింది.  ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ 10కోట్ల వరకు  రాబట్టే అవకాశాలు వున్నాయి. 


ఇక ఈచిత్రానికి  నైజాం లో వస్తున్న రెస్పాన్స్ చూసి  ఖంగుతిన్నాడట ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.   ఈ సినిమా ను మొదట నైజాం లో విడుదల చేయమని దిల్ రాజు కలిశాడట పూరి.  అయితే పూరి తీసిన మెహబూబా ను నైజాం లో విడుదల చేసి   భారీగా నష్టపోవడంతో ఈ ఆఫర్ ను తిరస్కరించాడట దిల్ రాజు. దాంతో పూరి మరో డిస్ట్రిబ్యూటర్ ను వెతుక్కున్నాడు. అయితే  ఇప్పుడు  సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూసి అనవసరంగా మంచి ఆఫర్ ను వదులుకున్నానని వాపోతున్నాడట దిల్ రాజు. 



మరింత సమాచారం తెలుసుకోండి: