కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'సురరై పోట్రు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.  గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  సూర్య కు జోడిగా అపర్ణ బాలమురళి  నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.  తమిళంలో ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ చిత్రం లో పరేష్ , ఎయిర్ లైన్స్ ఓనర్ గా  నెగిటివ్  షేడ్స్  వున్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం.    సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్  నిర్మిస్తున్న  ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.  


ఇక సూర్య  ఈ సినిమా కన్నా ముందు 'కాప్పాన్' తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.  కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్  ఆగస్టు 30న విడుదలకానుంది.  తెలుగులో ఈ చిత్రం 'బందోబస్త్'  పేరుతో విడుదలకానుంది. కాగా ఇటీవల 'యెన్ జి కె' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన   సూర్య కు ఆ సినిమా పెద్ద షాక్  ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలతోనైనా  హిట్లు కొట్టి సూర్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: