దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా కాలం తరువాత హిట్ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ రేంజ్ హిట్ అంటే రుపాయి పెట్టుబడి పెడితే రెండు రుపాయల లాభం తీసుకువచ్చింది ఈ సినిమా. కానీ ప్రస్తుతం పూరీ హిట్ కొట్టినా పూరీకి చేతిలో అవకాశాలైతే లేవు. ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో సినిమాలు తీసాడు పూరీ. మహేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీయార్లతో రెండు సినిమాలు తీసిన పూరీ జగన్నాథ్ అల్లు అర్జున్, రామ్ చరణ్ తో ఒక సినిమా తీశాడు. 
 
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ కు ఏ స్టార్ హీరో అవకాశం ఇచ్చేలా లేరు. యంగ్ జనరేషన్ హీరోలైన విజయ్ దేవరకొండ, నాని, శర్వానంద్, నిఖిల్, నితిన్ కూడా వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. అందువలన యంగ్ హీరోలు కూడా పూరీకి అవకాశమిచ్చేలా  లేరు. అందువలన పూరీ జగన్నాథ్ తరువాత సినిమాను తన కొడుకు ఆకాశ్ తో తీయాలని అనుకుంటున్నాడట. 
 
ఆకాశ్ పూరి "ఆంధ్రా పోరి" సినిమాతో తెలుగులో హీరోగా ఆరంగేట్రం చేశాడు. తొలి సినిమా డిజాస్టర్ అయింది. సొంత కొడుక్కి హిట్టివ్వాలని పూరీ జగన్నాథ్ కొడుకుతో "మెహబూబా" సినిమా తీశాడు. కానీ ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. అందువలన ప్రస్తుతం తన కొడుకుతో ఒక సినిమా తీసి హిట్టివ్వాలని పూరీ జగన్నాథ్ అనుకుంటున్నాడట. ఈ సినిమా తరువాత హీరో రామ్ తో "డబుల్ ఇస్మార్ట్ " మొదలుపెట్టబోతున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: