టాలీవుడ్‌లో  `పెళ్ళి చూపులు`.. `అర్జున్ రెడ్డి`  సినిమాల‌తో హీరోగా కెరియ‌ర్ ప్రారంభించిన విజ‌య్ దేవ‌ర‌కొండ  వ‌రుస హిట్ల‌తో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద రికార్డ్ సృష్టించాడు.  విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న న‌టించిన గీత గోవిందం కూడా మంచి హిట్ అందించింది. ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల క్ల‌బోలో చేరి పెద్ద హీరోల‌కే షాక్ ఇచ్చింది. ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన `నోటా` డిజాస్ట‌ర్ అవ్వ‌డం... ఆ త‌ర్వాత వ‌చ్చిన `టాక్సీవాలా` యావ‌రేజ్ అవ్వ‌డంతో విజ‌య్‌కు ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌స‌ర‌మైంది.


ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా మరోసారి కలిసి జంటగా...నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలేజీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ లక్ష్యం కోసం పోరాటం చేసే పాత్రలో విజయ్ దేవరకొండ కామ్రేడ్ గా న‌టిస్తున్నాడు.


ఈ సినిమాతో మ‌రో సారి గీతా గోవిందం, అర్జున్ రెడ్డి రేంజ్ హిట్ అందుకోవాల‌ని విజ‌య్ భావిస్తున్నాడు. అయితే కామ్రేడ్ లెన్త్ ఏకంగా 2 గంటల 50 నిమిషాలకు లాక్ చేయడం అందరికి షాక్ కలిగిస్తోంది. 170 నిమిషాలంటే అది మామూలు విష‌యం కాద‌ని అంటున్నారు. ఇంత డ్యూరేష‌న్  సినిమా అంటే ఏ మాత్రం బోరింగ్ లేకుండా బాగుంటేనే హిట్ అవుతుంది. 


సినిమా ల్యాగ్ అయ్యింద‌న్న టాక్ వ‌స్తే.. త‌ర్వాత ట్రిమ్ చేసినా ప్రేక్ష‌కుడు అప్ప‌టికే సినిమాపై నెగిటివ్ థింకింగ్‌తో ఉంటాడు. మ‌రి విజ‌య్ ఇంత రిస్క్ చేసి హిట్ కొడ‌తాడో ?  లేదో ?  తెలియాలంటే వ‌చ్చే శుక్రువారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: