వివాదాస్పద  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు ఎవరొకరిని విమర్శిస్తూ, అనవసర కామెంట్లు చేస్తూ వివాదాలకు గురవుతుంటాడు. ఆ వివాదాలకు గురైనవారు ఎన్ని ఫిర్యాదులు చేసిన అతనికి ఏం సంబంధం లేదు అన్నట్టుండే రాంగోపాల్ వర్మ, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం ప్రేమోషన్స్ మాత్రం భారీగా చేస్తున్నాడు. 


ఈ నేపథ్యంలోనే సినిమా సూపర్ మాస్ హిట్ కావడంతో ఇస్మార్ట్ శంకర్ టీం అంత పార్టీ చేసుకుంది. ఈ మాస్ పార్టీకి రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథి. సినిమాలో ఇస్మార్ట్ శంకర్ పార్టీ ఎలా చేసుకుంటాడో అచ్చం అలానే పార్టీ ఎంజాయ్ చేసారు ఆ మాస్ టీమ్. ఇంకా ముఖ్య అతిధి రామ్ గోపాల్ వర్మ అయితే రెచ్చిపోయాడు.         


'బీర్ ని తలపైన పోసుకొని ఎంజాయ్ చేస్తున్న వీడియోని తీసుకొచ్చి ట్విట్టర్ లో పెట్టేశాడు రామ్ గోపాల్ వర్మ'  ఆ వీడియోని ట్విట్టర్ లో జత చేసి పోస్ట్ చేస్తూ 'నాకు పిచ్చి లేదు కానీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నన్ను పిచ్చివాడిని చేసింది, కాబట్టి మీరు ఏమైనా అనాలనుకుంటే పూరి జగన్నాద్'ని ఛార్మి అని అనండి అంటూ' పోస్ట్ చేశాడు వర్మ. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: