ఒకప్పుడు స్టార్ హీరోగా వరుస హిట్లు ఇచ్చిన రవితేజ కెరీర్ ప్రస్తుతం చెప్పుకునేంత గొప్పగా లేదు. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా రవితేజ చివరి హిట్. ఆ తరువాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరోవైపు తెలుగులో హీరో సిద్దార్థ్ పరిస్థితి కూడా ఏమీ బాలేదు. 
 
తెలుగులో సిద్దార్థ్ నటించిన సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు తరువాత సిద్దార్థ్ నటించిన సినిమాలు తమిళంలో హిట్టైనా తెలుగులో మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాపుల్లో ఉన్నఈ ఇద్దరు హీరోలు కలిసి స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నారట. ఈ సినిమాకు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నాడు. దర్శకుడిగా అజయ్ భూపతికి ఇది రెండో సినిమా. ఈ సినిమాకు "మహాసముద్రం" అనే టైటిల్ ఫిక్స్ చెసినట్లు సమాచారం. 
 
ఆర్ ఎక్స్ 100 సినిమా అజయ్ భూపతికి ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. చిన్న సినిమాల్లో భారీ బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా. ఆర్ ఎక్స్ 100 సినిమాను రెండున్నర కోట్లతో  నిర్మిస్తే 20 కోట్ల దాకా వసూలు చేసింది. టాలీవుడ్లో మొదటి సినిమాతో హిట్ కొట్టిన చాలా మంది డైరెక్టర్లు రెండో సినిమా ఫ్లాప్ ఇచ్చారు. మరి అజయ్ భూపతి హిట్ కొట్టి ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: