అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు.  ‘జోష్’ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన చైతూ మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, గౌతమ్ మీనన్ తీసిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ సినిమాలో నటించిన నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లైన తర్వాత చైతూ నటించిన సినిమాలు వరసగా అపజయం కాగా..ఆ మద్య చైతూ-సమంత జంటగా  నటించిన ‘మజిలీ’సూపర్ హిట్ అయ్యింది. 

ప్రస్తుతం తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’ సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య.  ఒకపక్క ‘వెంకీ మామ’ సినిమా చేస్తూనే మరో పక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న రెండు సినిమాలే కాకుండా ఒక పెద్ద ప్రొడక్షన్స్ హౌజ్ తో భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.  యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చైతన్య ఒక సినిమా సైన్ చేశాడు. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ ప్రాజెక్టే అని అర్థమవుతుంది..మరీ ఈ సినిమా వివరాలు త్వరలో తెలపబోతున్నారట. వరసగా ఫ్లాప్స్ లో ఉండి చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్న హీరో నాగ చైతన్య. రియల్ లైఫ్ కపుల్ కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా హిట్టుతో మంచి జోష్ మీదున్న అక్కినేని కుర్రాడు ఈ మూవీస్ గనక హిట్ అయితే..స్టార్ హోదా కొంత కాలాం కాపాడుకున్నట్టే అవుతుంది.  ఒకవేళ ఈ మూవీకి ప్రభాస్ సపోర్ట్ దొరికితే అక్కినేని హీరో సినిమాకి భారీ క్రేజ్ వచ్చినట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: