ఈ మద్య నగరంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే.  వాహనదారులు మాకేమవుతుంది లే అని లేక్కలేకుండా వాహనాలు నడిపితే..మూడో కన్ను క్యాప్చర్ చేస్తూ ఫైన్ పడేలా చేస్తుంది.  నగరంలో ముఖ్య కూడలి వద్ద ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి అనౌన్స్ మెంట్ వస్తూనే ఉంటుంది.  సాధారణంగా సామాన్య పౌరులు త్రిబుల్ రైడింగ్..అందులోనూ హెల్మెట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  దిమ్మతిరిగే ఫైన్ వేస్తున్నారు. 


అయితే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఐకెన్ మేక్ ద రూల్..ఐకెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌ చేసి ట్రాఫిక్ పోలీసులకు సవాల్ విసిరారు.  త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను ప్ర‌మోట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్న వ‌ర్మ ఇప్పుడు.. ఆ స‌క్సెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ చిత్రం త‌ర్వాత పూరీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించాడు.


త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిలో ఒకరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ,కాగా మరొకరు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి, మరొకరు లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు అగస్త్య. వీరు ముగ్గురు మాస్ గెట్ అప్స్ లో ఒకే బైక్ పై వెళుతూ ఉంటె గుర్తుపట్టినవారు కొందరు ఫోటోలు తీశారు. మాములుగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఆపి చలానా వేస్తుంటారు.  మరి వర్మ విషయంలో చూసి చూడనట్టు వదిలేశారా ఏంటి..? ఇది ఒక్కరి ప్రశ్న కాదు.  అందరి ప్రశ్న.  అలా ప్రయాణించడమే కాకుండా వర్మ ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ ఫోటో వైరల్ గా మారింది.  దీనిపై ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: