టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లు లేక కెరీర్ పరంగా కొంత సతమతం అయిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా అయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావడం జరిగింది. ఇక విడుదలైన మొదటి ఆట నుండే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇస్మార్ట్ శంకర్ టీమ్ విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. 

ఇక అనుకున్న విధంగా తమ సినిమా మంచి సక్సెఫుల్ గా దూసుకెళ్తుండడంతో నేటి ఉదయం పూరి తన టీమ్ తో కలిసి పెద్ద పార్టీ చేసుకున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఈ పార్టీ ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తన కెరీర్ పరంగా ఇప్పటివరకు తాను రాసుకున్న కథల్లో ది బెస్ట్ కథగా పూరి చెప్పుకునే 'జనగణమణ' ఎప్పటికైనా సూపర్ స్టార్ మహేష్ తో తీయాలని అనుకుంటున్నట్లు ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పూరి చెప్పడం జరిగింది. అయితే మహేష్ మాత్రం ఎవరైనా దర్శకుడు హిట్స్ లో ఉంటేనే తప్ప కథలు వినరని, అందువల్లనే తన జనగణమణ సినిమా గురించి మహేష్ కు చెప్పడానికి ఇప్పటివరకు వీలు కుదరలేదని పూరి ఇటీవల మహేష్ పై సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. 

ఇక నేడు ఈ సినిమా విషయమై పూరికి హీరో దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. తన జనగణమణ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని అయిన రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీయాలని పూరి సంకల్పించినట్లు సమాచారం. అంతేకాక తన సినిమా స్టోరీలైన్ ను ఇటీవల విజయ్ కు వినిపించగా అయన కూడా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి దీనిపై క్లారిటీ  రావాలంటే, పూరి కానీ లేదా విజయ్ కానీ స్పందించాల్సిందే ......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: