బాలీవుడ్ ఫగ్లీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఈ సినిమా గురించి బయట పెద్దగా తెలియదు. ఈ మూవీ తరువాత ఎంఎస్ ధోని సినిమాతో హిట్ కొట్టింది. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ తీసిన లస్ట్ స్టోరీస్ తో కిక్కెక్కించింది. లస్ట్ స్టోరీస్ లో ఆమె నటన చూసి బాబోయ్ అనుకున్నారు.
ఒక ఫ్రేమ్ లో ఆమె ఎక్స్ ప్రెషన్ చూస్తే.. ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అక్కడ ధోని మంచి హిట్ కాగానే మహేష్ భరత్ అనే నేనులో అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. భరత్ మంచి హిట్టయ్యాడు. ఆ వెంటనే చరణ్ వినయ విధేయ రామలో అవకాశం దక్కింది.
బోయపాటి సినిమా కాబట్టి మంచి హోప్స్ పెట్టుకుంది. కానీ, పాపం ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇంకేముంది టాలీవుడ్ లో ఆఫర్లు దొరకలేదు. సరే అనుకోని బాలీవుడ్ కు వెళ్ళగానే కబీర్ సింగ్ రూపంలో అవకాశం వచ్చింది. ముద్దే కదా ఇచ్చేస్తే పోలా అన్నట్టుగా ఇచ్చింది. కబీర్ సింగ్ సూపర్ హిట్.
దీంతో ఆమె కెరీర్ ఫుల్ జోష్ లోకి వెళ్ళింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆమెతో రెండు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ రెండింటితో పాటు మరి కొన్ని ఆఫర్లు కూడా రెడీ గా ఉన్నాయి. బాలీవుడ్ లో బిజీ కావడం వలన ఆమె ఇక టాలీవుడ్ సినిమాలు చేయబోదని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలి.