నిరంతరం వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా తన శిష్యుడు పూరి జగన్నాథ్ నిర్మాతగా దర్శకుడిగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు వెళ్లి హైదరాబాద్ పోలీసులను కెల్లికి అడ్డంగా బుక్ అయిపోయారు. విషయంలోకి వెళితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూడటానికి ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య ముగ్గురూ ట్రిపుల్ రైడ్ లో బైక్ పై శ్రీరాములు థియేటర్ కు వెళ్లారు.


ఈ క్రమంలో సైలెంట్ గా బండి మీద వెళ్లే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ పోలీసులకు కెలికాడు. ట్విట్టర్ లో హైదరాబాద్ పోలీసుల ఉద్దేశించి...హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్ లో బైక్ పై వెళుతున్నాం.. పోలీసులు ఎక్కడ.. బహుశా థియేటర్ లోపల ఉన్నారనుకుంటా అంటూ రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.


దీంతో వర్మ సెటైర్లకు పోలీసులు జరిమానాతో సమాధానం ఇచ్చారు వర్మ ప్రయాణించిన బైక్ నెంబర్ గుర్తించి హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడ్ వెళ్లినందుకు 1300 రూపాయలు జరిమానా విధించారు. వర్మ ప్రయాణించిన బైక్ నెంబర్  టీఎస్ 07 జీపీ 2552కు జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: