శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా రానున్న చిత్రం 'భారతీయుడు-2'. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొద్ది రోజులకి ఆగిపోయింది మళ్లీ షూటింగ్ ని ప్రారంభించాలనుకున్నారు. కానీ, దర్శకుడికి నిర్మాతలకు మధ్య బడ్జెట్ విషయంలో గొడవలు మొదలయ్యాయి.



 తాజాగా తెలిసిన విషయం ఏంటంటే గొడవలు క్లియర్ ఐనట్టు, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం అవుతుందని తెలియజేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాజల్ తో పాటు మరో ఇద్దరు కూడా నటిస్తున్నట్లు కథనాలు.



 ఐశ్వర్య, రాజేష్, ప్రియా భవానీలను కీలక పాత్రలకోసం ఎంపిక చేశారని సమాచారం. ఐతే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా అనిరుధ్ రవిచంద్రన్ వహిస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ చిత్రం 2020 న విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: