భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రోబో 2.0 తరువాత చేయబోయే భారతీయుడు-2 సినిమాపై రకరకాల కథనాలు వస్తున్నాయి. సినిమా ఆగిపోయిందని.. త్వరలో షూటింగ్ ఉంటుందని అనేకమైన గాసిప్స్ వస్తున్నాయి. అయితే దేనిపైనా క్లారిటీ లేదు. దీనిపై శంకర్ గానీ లైకా ప్రొడక్షన్స్ గానీ ఎటువంటి వార్తను రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడీ సినిమాపై ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

 

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో కాజల్, ఐశ్వర్యారాజేశ్, ప్రియాభవానీశంకర్.. ఇలా హీరోయిన్ల లిస్టు చాంతాడంత పెంచుకుంటూ పోతున్నారు. లేటెస్ట్ గా వస్తున్న వార్తలు ఏంటంటే శంకర్ ఈసినిమాలో కీలక రోల్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని అప్రోచ్ అయ్యాడంటూ ఓ వార్త షికారు చేస్తోంది. పాత్ర నచ్చిన రకుల్ ఓకే కూడా చెప్పిందట. కానీ ఆ రేటు నిర్మాతలకు నచ్చటం లేదట. ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట రకుల్ బేబి. రకుల్ డిమాండ్ అలా వుంది. కమల్-శంకర్ కాంబో, ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి రకుల్ తన డిమాండ్ కు తగ్గట్టే అడిగింది మరి.

 

ఈ వార్తలో నిజం ఎంతుందో తెలీదు కానీ సినీ సర్కిల్స్ లో ఈ వార్త తెగ షికారు చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్ గురించి లైకా సంస్థకు శంకర్ కు చిన్నపాటి విబేధాలున్నాయని అవి క్లియర్ అయ్యాయని త్వరలోనే షూటింగ్ జరుపుకోనుందని కోలీవుడ్ టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంతో. ఈ వార్త నిజమైతే రకుల్ పంట పండినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: