‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అవ్వడంతో జోష్ లోకి వెళ్ళిపోయిన పూరి జగన్నాథ్ వివిధ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ అతడిలోని యాటిట్యూడ్ ని మళ్ళీ బయటపెడుతోంది. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మహేష్ ను టార్గెట్ చేస్తూ పూరీ చేసిన కామెంట్స్ పై మహేష్ అభిమానుల నుంచి తీవ్రవ్యతిరేకత వస్తోంది. గతంలో కూడ పూరి ఇలాంటి కామెంట్స్ చాల మంది టాప్ హీరోల పై చేసాడు. 

చిరంజీవితో 150వ సినిమాగా ‘ఆటోజానీ’ సినిమా తీయడానికి ప్రయత్నిస్తూ అనేక సార్లు చిరంజీవికి కథ చెప్పి ఆకథకు పూర్తిగా మెగా స్టార్ ని ఒప్పించ లేకపోవడంతో అసహనానికి లోనైన పూరి చిరంజీవిని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసి మెగా అభిమానుల కోపానికి కారణం అయ్యాడు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాను తీసి ఆసినిమా అనుకున్న ఫలితం సాధించ లేకపోయిన పరిస్థుతులలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ ను టార్గెట్ చేస్తూ పూరీ కామెంట్ చేసాడు. 

పవన్ కు సినిమా కథ చెప్పనక్కరలేదని చేతిలో రెండు గన్స్ పెడితే చాలు తాను నటించే సినిమా కథ ఏమిటి అదేవిధంగా సీన్ ఏమిటి అన్న విషయాలు కూడ అడగకుండా పవన్ వెంటనే ఒప్పుకుంటాడు అంటూ పవన్ పై జోక్ వేసి పవన్ అభిమానుల నుండి తీవ్రవ్యతిరేకత ఎదుర్కున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ‘టెంపర్’ తీసి జూనియర్ కు హిట్ ఇచ్చినా ఆతరువాత పూరి తీరు నచ్చకపోవడంతో జూనియర్ పూరీకి మళ్ళీ అవకాశాలు ఇవ్వలేదు అన్న వార్తలు ఉన్నాయి. 

ఇలా టాప్ హీరోలు అందరితోను పూరీకి గ్యాప్ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సస్ అయినంత మాత్రాన ఏటాప్ హీరో పూరీ వంక చూడడనీ దీనికితోడు ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరు మరో రెండు సంవత్సరాల వరకు ఖాళీగా లేని పరిస్థితులలో పూరి ఇక కేవలం రామ్ లాంటి మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలు తీయవలసిందే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే పూరీ లాంటి యాటిట్యూడ్ కలిగిన విజయ్ దేవరకొండతో సినిమాను తీసి భారీ హిట్ కొట్టగలిగితే అప్పుడు మాత్రమే మళ్ళీ టాప్ హీరోలు పూరీ వైపు చూసే ఆస్కారం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: