ఫిలిం ఇండస్ట్రీలోకి మిసైల్ లా దుసుకువచ్చిన మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ ఒక సంచలనం. ‘శ్రీమంతుడు’ ‘జనతాగ్యారేజ్’ ‘రంగస్థలం’ లాంటి బ్లాకు బస్టర్ మూవీలు ఈనిర్మాణ సంస్థ నుండి రావడంతో టాప్  హీరోలకు అత్యంత ఇష్టమైన నిర్మాణ సంస్థగా మైత్రి మారి పోయింది. టాప్ హీరోలను బుట్టలో వేసుకోవడాని భారీ పారితోషికాలు ఇవ్వడంలో ఈ నిర్మాణ సంస్థ వ్యూహాల ముందు చాలమంది నిర్మాతలు నిలబడలేక పోతున్నారు. 

ఈసంస్థలో నవీన్ రవిశంకర్ మోహన్ అనే ముగ్గురు భాగస్వాములుగా కొనసాగుతున్నారు. దీనికితోడు వీరు మంచి స్నేహితులు కూడ ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ నుండి మోహన్ తప్పుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నిర్మాణ సంస్థ భాగస్వాములు విడిపోవడానికి వెనుక చాల కారణాలు ఉన్నాయి అంటున్నారు. 

మోహన్ మైత్రీ సంస్థ వ్యవహారాల కోసం తరుచు అమెరికా నుండి వచ్చి ఇక్కడి వ్యవహారాలు చూసుకోవడం కష్టం అవుతోంది అన్న కారణంతో మోహన్ ఈ సంస్థ నుండి తప్పు కుంటున్నట్లు టాక్. దీనికితోడు ఈ సంస్థ నిర్మాణం చేపడుతున్న సినిమాల విషయంతో పాటు సుకుమార్ మహేష్ బాబు మధ్య తేడా రావడం సుకుమార్ ను తీసుకెళ్లి బన్నీతో అర్జెంట్ గా సినిమా ప్రకటించడం వంటి వ్యవహారాలు మోహన్ కు అంతగా నచ్చలేదని తెలుస్తోంది.

దీనితో ప్రస్తుతం ఈ సంస్థ నిర్మాణం చేపడుతున్న సినిమాల వ్యవహారాలూ అన్నీ పూర్తి అయిన తరువాత మోహన్ ఈ సంస్థ నుంచి తప్పు కుంటాడు అని అంటున్నారు. వాస్తవానికి ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి. టాప్ హీరోలకు అవసరం అనుకుంటే వారి పై మోజుతో 20 నుండి 25 కోట్ల వరకు పారితోషికాలు ఇచ్చే ఈ సంస్థలో ఏర్పడ్డ సమస్యలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: