సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా 25వ సినిమాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనకు అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమా ఇచ్చిన మంచి సక్సెస్ ఊపుతో ప్రస్తుతం మహేష్ బాబు తన తదుపరి 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతోంది. 

సూపర్ స్టార్ సరసన రష్మిక జోడి కడుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి, సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే మహేష్ చేయబోయే ఆ తరువాతి సినిమా అయిన 27వ సినిమాపై గత కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ విషయం అటుంచితే, మహర్షితో తన లైఫ్ లో గుర్తుండిపోయే మంచి సక్సెస్ ని ఇచ్చిన వంశీ పైడిపల్లితో సూపర్ స్టార్ మరొక సినిమా చేయడానికి సిద్ధమయినట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా విషయమై నేడు ఒక వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, మహర్షి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ ఆ సినిమా లెంగ్త్ కొంత ఎక్కువ  అయిందని,అదీకాక సినిమాలో ఎంటర్టైన్మెంట్ ని చాలా వరకు మిస్ అయ్యాం అని ఫీల్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్ కోసం వంశీ, 

ఈ సారి మహేష్ తో చేయబోయే సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఫార్మాట్ లో తీయాలని సంకల్పించి ఒక అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని మహేష్ బాబును చూస్తారని, అలానే ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో పాటు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో ఉంటుందని తన సన్నిహితుల వద్ద వంశీ ప్రస్తావించడం జరిగిందట. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మరొక బ్లాక్ బస్టర్ లభించినట్లే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: