ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ `నేను లేను`… `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌.. హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ నుండి ప్రతిదీ ఒక సంచలనమే.  ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ ను దాదాపు కోటి ముప్పై లక్షల మంది వీక్షించారు.

 

అంటే ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి అభినందించారంట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా జూలై 26 న విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

 

అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సైకలాజికల్ చిత్రంలో ప్రేక్షకులని ఉత్కంఠకి గురి చేసే అంశాలు చాలా ఉన్నాయట. ఈ సినిమాలోని ప్రేమకథ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని కలిగిస్తుందట. ఇంతకుముందెప్పుడూ చూడని అంశాన్ని తీసుకుని సినిమాని తెరకెక్కించారట. అందుకని ప్రేక్షకులు థ్రిల్ ఫీలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ట్రైలర్ లాగే సినిమా కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని ధృడ నిశ్చయంతో ఉన్నాడు.

 

ఇంకా, సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, నాకు ఏదీ కావాలన్నా సపోర్ట్ చేసిన నిర్మాతకి , సినిమాలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు  దన్యవాదాలు తెలియజేసాడు. నిర్మాత మాట్లాడుతూ, ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని  సరికొత్త సినిమాని ప్రేక్షకులు చూడబోతున్నారని, చిత్రానికి పని చేసిన యూనిట్ అందరికీ దన్యవాదాలు తెలియజేసాడు.  అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనే గట్టి నమ్మకంతో ఉన్నామని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: