‘భరత్ అనే నేను’ మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన కియారా అద్వాని ఇప్పటి వరకు నటించిన సినిమాలు చాల తక్కువే అయినా యూత్ లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందం నటించే సామర్ధ్యం ఉన్నప్పటికీ సినిమాలలో అవకాశాల కోసం తన కెరియర్ తొలి రోజులలో నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఎంత ఓర్పు ఉండాలో వివరించింది.

ఇదే సందర్భంలో ఇండస్ట్రీలో కొనసాగుతున్న పురుషాదిపత్యం గురించి మాట్లాడుతూ ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రతి ఇంటిలో భర్తతో సమానంగా భార్య ఇప్పటికీ హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితులలో ఏ రంగంలో అయినా స్త్రీ రాణించాలి అంటే పోరాటం చేయకుండా గెలుపు రాదు అంటూ కామెంట్స్ చేసింది. 

ఇక టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తాను నటించిన టాప్ హీరోల గురించి మాట్లాడుతూ ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను మహేష్ చరణ్ లతో కలిసి వేరువేరు సినిమాలలో నటించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ వారిద్దరి మధ్యా ఉన్న కొన్ని తేడాలను బయటపెట్టింది. వారిద్దరు ఇందాస్త్రీలోని టాప్ ఫ్యామిలీస్ వారసులుగా వచ్చినా కష్టపడటంలో ఎటువంటి రాజీపడరు అన్న కామెంట్స్ చేసింది. 

అయితే మహేష్ బయట గంభీరంగా కనిపించినా సెట్ లోకి రాగానే తెగ జోక్స్ వేస్తూ అందర్నీ నవ్విస్తాడనీ అయితే చరణ్ మాత్రం చాల సింపుల్ గా ఉంటూ ఎదుటి వ్యక్తులతో చాల సభ్యతగా మాట్లాడుతాడు అన్న విషయాలను తెలియచేసింది. అయితే మహేష్ జోక్స్ లో అతడి స్మార్ట్ నెస్ కనిపిస్తే చరణ్ మాటలలో తనకు చిన్న పిల్లవాడి మనస్తత్వం కనిపిస్తుంది అంటూ వారిద్దరు తమతోటి నటులను గౌరవించే పద్ధతికి ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు అని అంటోంది. ఏ రంగంలో అయినా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎవరు ఎవరికీ సహాయపడరనీ మన పరాజయాలకు మరొకరిని నిందించుకోవడంలో అర్ధంలేదు అంటూ కియారా అద్వాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: