తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు  మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది చివ‌రిలో విడుదల కానున్నఅనుష్క 'నిశ్శబ్దం' ప్రచార చిత్రం  విడుదల ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి  క్రాస్ ఓవ‌ర్ చిత్రం  ''నిశ్శబ్దం'. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. సుప్రసిద్ధ నాయిక అనుష్క శెట్టి న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ''నిశ్శబ్దం'' టైటిల్ ప్రచార చిత్రం విడుదల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు. 


అమెరికా లోని సియాటల్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: