ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా ప్రచారం జరుగుతుంది.  తెలుగుదేశం పార్టీ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ బాధ్యతలు స్వీకరించాలి అనే వాళ్లు ఉన్నారు. లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన నాయకత్వంలో పని చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు  ఎంత వరకూ ముందుకు  వస్తారనేది చర్చనీయాంశంగా మారింది.


లోకేష్ లో ప్రజలను కట్టిపడేసే వాక్చాతుర్యం లేకపోవడం - ట్విటర్ కు మాత్రమే పరిమితం కావడం ఆఖరికి ఎమ్మెల్యేగా ఓడిపోవడం.. ఇవన్నీ నెగిటివ్ పాయింట్లు అవుతున్నాయి. సరిగ్గా ఈ క్వాలిటీస్ లో ఎన్టీఆర్ చాలా ముందున్నాడు. దీంతో ఎన్టీఆర్ నాయకత్వ బాధ్యతలు  స్వీకరిస్తే  పార్టీలో యాక్టివేట్ అయితే తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం రావొచ్చు.అయితే ఎన్టీఆర్ కు చంద్రబాబు అవకాశం ఇవ్వరనేది బహిరంగ సత్యం. ఆ సంగతలా ఉంటే..ఏపీ ప్రభుత్వంతో ఎన్టీఆర్ సఖ్యతగా ఉండబోతున్నారనే  ప్రచారమూ  సాగుతోంది.

ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ నియమితం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.ఇదే సమయంలో మరో ప్రచారం ఏమిటంటే..సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారట ఎన్టీఆర్. ఈ మేరకు ఇప్పుడు  ఒక ప్రచారం మొదలైంది. జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ను కోరుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. త్వరలోనే  తీరిక చూసుకుని తారక్ తో సమావేశానికి జగన్ మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: