ఈ సంవత్సరం మొదటిలోనే పడి పడి లేచే మనసు చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన శర్వానంద్ తన తదుపరి చిత్రంలో బిజీ అయిపోయాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న‘రణరంగం’ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేస్తుంది. ఇందులో శర్వానంద్ హిరోగా నటిస్తుండగా, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటను శనివారం విడుదల చేశారు. ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి…మనసు మీటి వెళ్లే నంట మనోహరి’ అనే పల్లవి గల ఈ గీతాన్ని కృష్ణ చైతన్య రచించగా… చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రిగ్రూజ్ ఆలపించారు. శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినిలపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కథాపరంగా శర్వానంద్, ప్రియదర్శినిల మధ్య ఉన్న ప్రేమకు చక్కని వెండితెర రూపం ఈ పాట. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్తదనాన్ని అందించింది.

ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు . ఈ చిత్రానికి అర్జున్ – కార్తీక్ మాటలు రాయగా, ప్రశాంత్ పిళ్ళై సంగీతాన్ని అందించారు. దివాకర్ మణి ఛాయాగ్రహణం, రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య తమదైన రితీలో పాటలు రాశారు. ఇంకా ఎడిటర్ నవీన్ నూలి, ఫైట్ వెంకట్, బృంద, శోభి, శేఖర్ డ్యాన్స్ మాస్టర్లుగా ఉన్నారు.

https://www.youtube.com/watch?v=JqE5p4O0_MY

మరింత సమాచారం తెలుసుకోండి: