తమిళంలో సూపర్ హిట్ సాధించిన గ్యాంగ్ స్టర్ కామెడీ చిత్రం జిగర్తాండ హిందీలో కూడా రీమేక్ అవుతుంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో గా సిద్ధార్థ్, హీరోయిన్ గా లక్ష్మీ మీనన్ నటించారు. తమిళంలో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన బాబీ సింహాకి, ఎడిటింగ్ చేసిన వివేక్ హర్షన్ కి జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది.


2014 లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుంది. నటుడు అజయ్ దేవ్ గణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జిగర్తాండ సినిమాలో బాబీ సింహా క్యారెక్టర్ ని హిందీలో సంజయ్ దత్ చేస్తున్నారు. హీరోయిన్ లక్ష్మీమీనన గా తమన్నాని, సిద్ధార్థ్ క్యారెక్టర్ గా ఫర్హాన్ అక్తర్ ని అనుకున్నారు. ఉడ్తా పంజాబ్ ఫేమ్ అభిషేక్ చౌబే ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.


అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త బయటకు వచ్చింది. లక్ష్మీ మీనన్ పాత్రలో తమన్నా చేయడం లేదని అంటున్నారు. అలాగే ఫర్హాన్ అక్తర్ కి బదులు కార్తీక్ ఆర్యన్ చేయబోతున్నాడని సమాచారం. నటీనటులు ఎందుకు మారారనేది తెలిసి రాలేదు. దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు. కాకపోతే, తమన్నాకి ఈ రీమేక్ లో నటించడం ఇష్టం లేకపోవడం వల్లనే తప్పుకుందని అంటున్నారు
.
అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ తమన్నా సినిమా చేయకపోవడం చర్చనీయాంశం అయింది. అదీ గాక తమన్నాకి తెలుగు తమిళ భాషల్లో చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ  సినిమా చేయకపోవడం వల్ల ఆమెకి నష్టం ఉండదని అనుకుంటున్నారు. జిగర్తాండ సినిమాని తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో " వాల్మీకి"గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: