మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  సినిమా ప్రపంచం తప్పించి మరే ప్రపంచం తెలియదు.  అందుకే  టాప్ హీరోగా ఎదిగారు.  సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్, కొద్దికాలంలోనే తనదైన ముద్రను వేసుకున్నారు.  మాస్, క్లాస్ ను మెప్పించే సినిమాలు చేశారు.  



చాలా మందికి తెలియని విషయం ఏమంటే... మహేష్ బాబు సెట్స్ లో చాలా సరదాగా ఉంటారు.  సెన్సార్ హ్యూమర్ ఎక్కువ.  ఈ విషయాన్ని లస్ట్ స్టోరీస్ బ్యూటీ కియారా కూడా కన్ఫర్మ్ చేసింది.  ఫగ్లీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఎంఎస్ ధోనితో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం భరత్ అనే నేను సినిమా చేసింది.  


మహేష్ బాబు సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని, మహేష్ గురించి ఆయనతో సినిమా చేసే ముందు వరకు తెలియదని చెప్పింది కియారా.  మహేష్ తో సినిమా అనగానే ఆయన సినిమాలు కొన్ని చూసిందట.  సెట్స్ కి వెళ్లిన తరువాత ఒక ఫ్రెండ్ గా మారిపోయింది.  మహేష్ తో సినిమా హిట్టయ్యాక చరణ్ తో సినిమా చేసింది.  


చరణ్ తో సినిమా చేయడం అదృష్టంగా చెప్పిన కియారా చరణ్ టాలెంట్ హీరో అని, డెడికేషన్ ఉన్న వ్యక్తి అని చెప్పింది.  ఆ డెడికేషన్ వలనే ఇండస్ట్రీలో టాప్ గా ఎదిగారని చెప్పింది.  ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ వైపు వచ్చే ఆలోచన లేనట్టుగానే ఉన్నది.    


మరింత సమాచారం తెలుసుకోండి: