రవితేజ కి హీరోగా మంచి బూస్ట్ ఇచ్చింది ఎవరు అంటే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వారు అంటుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఇడియట్', 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి'... వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన  కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం మనకందరికీ తెలిసినదే.


ఇటువంటి నేపథ్యంలో మహేష్ తో గతంలో చేయాల్సిన జనగణమన ప్రాజెక్టును రవితేజతో చేయాలనే ఆలోచనలో పూరిజగన్నాద్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' రాకముందు వరకూ పూరి జగన్నాథ్, రామ్ ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు.


అయితే సినిమా ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ అవడంతో..ఇద్దరి కెరియర్ లకి మంచి బూస్ట్ వచ్చింది. అయితే గతంలో తాను ఫ్లాపుల్లో ఉన్న టైం లో జనగణమన ప్రాజెక్ట్ గురించి మహేష్ తో చేయాలి అనుకున్న సమయంలో మహేష్ నుండి సరైన రెస్పాండ్ రాకపోవడంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు పై షాకింగ్ కామెంట్ చేసిన పూరి... అదే ప్రాజెక్టుతో ఫ్లాపుల్లో ఉన్న రవితేజతో తీసే ఆలోచనలో పూరి జగన్నాథ్ వున్నట్లు చాలా గట్టిగా ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఎలాగైనా జనగణమన తో రవితేజ కి లైఫ్ ఇచ్చే ఆలోచనలో డాషింగ్ డైరెక్టర్ పూరి ఉన్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: