బుల్లితెర మెగా సంబరం,మూడు నెలల హంగామా అందించే ఏకైక షో బిగ్ బాస్ షో.బిగ్ బాస్ సీజన్ 3 ఈరోజు నుండి ప్రారంభం అవుతుంది.15 మంది కాంటెస్టెంట్స్,100 రోజులు, ఒక్క బిగ్ బాస్ హౌస్ ఇదే ఇప్పుడు అందరూ ఎదురుచూస్తుంది. అయితే మొదటి సీజన్ కి వచ్చినంత ప్రజాధారణ రెండో సీజన్ కి రాలేదు అలాగే ఇప్పుడు ప్రారంభిస్తున్న 3 సీజన్ పై విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ నడుస్తుంది.

ఇప్పటికే  యాంకర్ శ్వేతరెడ్డి మరియు నటి గాయత్రి గుప్తా షో నిర్వహకులపై కేసులు నమోదు చేశారు. అయితే ఇవేమీ పట్టవన్నట్టు షో యాజమాన్యం బిగ్ బాస్ షో ను నేటి నుండి ప్రారంభిస్తుంది. ఇప్పటికే 15 మంది ఫైనల్ కాంటెస్టెంట్స్ ను ప్రకటించింది.హీరో వరుణ్ సందేశ్, అతని భార్య వితిక, నటి హేమ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ సావిత్రి,నటి పునర్నవి,టీవీ9 జాఫర్,డాన్స్ మాస్టర్ బాబా, టీవీ నటుడు భరణి,రవి కృష్ణ,అలీ రేజా, టీవీ నటి రోహిణీ,నటి హిమాజ, సింగర్ రాహుల్,కమెడియన్ మహేష్ విట్ట వీళ్ళు ఫైనల్ కాంటెస్టెంట్స్ అని స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది.

బిగ్ బాస్ షో లో కాంటెస్టెంట్స్ ఎంత ముఖ్యమో షో నడిపించే హోస్ట్ కూడా అంతే ముఖ్యం.మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు, రెండో సీజన్ లో హీరో నాని పర్వాలేదు అనిపించాడు, ఇప్పుడు కింగ్ నాగార్జున ఎలా షో నడిపిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: