వివాదాస్పద దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అంతా జోష్ ఎందుకో అని అనుకుంటున్నారా.. అతని శిష్యుడు పూరి జగన్నాథ్ చాలా కాలం తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ కొట్టాడు. అందుకే ట్విట్టర్ బ్లాస్ట్ అయ్యేలా సినిమా ప్రేమోషన్స్ చేశాడు రాంగోపాల్ వర్మ. 


నిన్న అయితే రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో చేసిన అల్లరిని పోలీసులు కూడా భరించలేకపోయారు. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ మీట్ అంటూ రాంగోపాల్ వర్మ తనపై తనే మందు పోసుకున్న వీడియో ట్విట్టర్ లో పెట్టడం. ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడటం కోసం బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసి పోలీసులు ఎం చేస్తున్నారు అనడం. వాళ్ళు స్పందిస్తే నాకు ఇంకో కూతురు ఉంటే నిన్ను అల్లుడిని చేసుకునే వాడిని అని పోలీసులకు చెప్పడం మాములుగా రచ్చ చెయ్యలేదు వర్మ.


ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభ నటశాకి ఫ్యాన్ అయ్యా అంటూ ట్విట్ చేశాడు. ఇలియానా 2.0 నభ నటశా అంటూ రాంగోపాల్ వర్మ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ కి స్పందించిన సభ నటశా థ్యాంకు సర్ .. అంటూ ట్విట్ చేసింది. ఒకప్పుడు శ్రీదేవికి ఫ్యాన్ అయిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు సభ నటశా కి ఫ్యాన్ అంటూ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నాడు. ఇవి అన్ని చూసిన నెటిజన్లు 'ఒక్క రోజైన రాంగోపాల్ వర్మల జీవించాలి' అంటూ ట్విట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: