పూరీ జగన్నాథ్ ఈ మధ్య తీసిన సినిమాల్లో అంతో ఇంతో అంచనాలతో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. సినిమా కథ, కథనం రొటీన్ గానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో సరైన మాస్ సినిమా రాకపోవడం, థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ కు పోటీనిచ్చే సినిమా మరేదీ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి. మూడు రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ 36 కోట్ల గ్రాస్, 15.80 కోట్ల షేర్ వసూళ్ళు సాధించింది. కానీ ఈ సినిమాకు రేపటినుండి అసలు పరీక్ష మొదలుకాబోతుంది. 
 
సాధారణంగా సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా సోమవారం వచ్చేసరికి కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి. మరి అబవ్ యావరేజ్ టాక్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రేపటినుండి ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా మండే టెస్ట్ పాస్ అయితే మాత్రం డియర్ కామ్రేడ్ రిలీజ్ అయ్యేదాకా ఇస్మార్ట్ శంకర్ సినిమా కలెక్షన్లకు లోటు లేనట్లే. హీరో రామ్ కెరీర్లోనే ఇస్మార్ట్ శంకర్ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడట. రెండు నెలల తరువాత తన కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తాడని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం మేరకు పూరీ జగన్నాథ్ తరువాత సినిమా బాలకృష్ణతో ఉంటుందని సమాచారం అందుతుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో హీరోయిన్లైన నభా నటేష్, నిధి అగర్వాల్ ఇద్దరికీ కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: