బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు నచ్చే రియాలిటీ షో. తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ కి ఉన్న ఫాలోయింగ్ ఇంకా ఏ షో కి ఉండదు. ఈ షో ఎప్పుడు మొదలైన బుల్లితెర ప్రేక్షకులు చూస్తారు, ఈ షో కి అంత క్రేజ్ ఉంది మరి. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే, సీజన్ 2 కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు సీజన్ 3 కి మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.     


ఈ షో కోసం వాళ్ళ ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రేమోషన్స్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ మీడియాలో బిగ్ బాస్ పై ఎప్పుడు రెండు కళ్ళు వేసి చూస్తుంటుంది. ఎందుకంటే అది రియాలిటీ షో కాబట్టి సెలబ్రెటీస్ ఎవరు ఎం చేస్తున్నారు అనేది తెలుసుకోడానికి ప్రజలు వెయిట్ చ్చేస్తుంటారు కాబట్టి ఆన్లైన్ మీడియాలో కథలుకథలుగా రాస్తూనే ఉంటుంది. కానీ ఈసారి బిగ్ బాస్ కి పబ్లిసిటీ చాలదు అనుకున్నట్టు ఉన్నాడు. అందుకే రచ్చ రచ్చ చేసాడు అని అంటున్నారు నెటిజన్లు . 


నిన్నటి వరుకు కాదుకాదు ఉదయం వరుకు బిగ్ బాస్ వాయిదా పడింది అనుకున్నారు. ఎందుకంటే అంత రచ్చ జరిగింది. బిగ్ బాస్ నిర్వాహకులు లైంగికంగా వేధించారని యాంకర్ శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా ఆరోపణలు చేసి పెద్ద గొడవే చేశారు నిన్నటివరకు. దీంతో అన్ని టీవీ ఛానళ్లు, దిన పత్రికలు బిగ్ బాస్ గురించి న్యూస్ కవర్ చేశారు. ఈ న్యూస్ కవరేజ్ తో గల్లీ నుంచి ఢిల్లీ వరుకు ప్రతి ఒకరు తెలుగు బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది బిగ్ బాస్ కి. 


ఈ షో ఆగిపోయింది, నాగార్జున హోస్ట్ గా తప్పుకున్నారు అని అందరూ భావించారు కానీ అవేమీ జరగలేదు. యధావిధిగా ఈ షో ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షో ప్రారంభంకు సంబంధించి ప్రోమో కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ షో ని చూస్తారు, ఎం జరిగింది ? ఎం జరుగుతుంది అని అంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది ఈ షో కి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.    
 



మరింత సమాచారం తెలుసుకోండి: