తెలుగులో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయిన యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా వచ్చిన ఆమె అతి తక్కువ కాలంలోనే మంచి పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది.  అనసూయ యాంకర్ గా ఎంత పాపులారటీ సంపాదించిందో అంతే విధంగా కాంట్రవర్సీలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.  ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. 

 అనసూయ పేరుతో అశ్లీల పోస్ట్ లు పెడుతూ, బూతు పదజాలం ఉపయోగించిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కలకలం సృష్టిస్తున్నారు. వాటిని గుర్తించిన ప్రోగ్రెసివ్ యూత్ నాయకులూ సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.  రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకుంటుంది. 

ఈ నేపథ్యంలో ఆమెపై మరోసారి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. యాంకర్ అనసూయ పేరుతోనే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి కొందరు ఈ సంఘటనలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు కోరారు.

ఇలాంటి సంఘటనల వల్ల అనసూయ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అనసూయని ఇబ్బంది పెట్టేలా ఆమె ఇమేజ్ దెబ్బతినేలా ఏ అసభ్యకరమైన పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: