కొన్నాళ్లుగా హంగామా సృష్టిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ షో మీద రకరకాల వార్తలు రాగా అవేవి షోని ఆపలేకపోయాయి. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రత్యక్షమయ్యాడు. ఇక షోకి వెల్కం చెబుతూ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లాడు నాగార్జున.


హౌజ్ మొత్తం తిరుగుతూ బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కడ ఏవి ఉంటాయో చెబుతున్నాడు. ఇక ఇప్పటికే 15 మంది ఇంటి సభ్యులుగా రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే షోలో భాగంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు ఫస్ట్ 3 కంటెస్టంట్స్ ను ఎంపిక చేయమని టాస్క్ ఇచ్చాడు. 


బిగ్ బాస్ చెప్పినట్టుగా 15 మంది కంటెస్టంట్స్ లో 1, 2, 3 అంటూ ముగ్గురు కంటెస్టంట్ ను డ్రా తీశాడు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి కంటెస్టంట్ గా తీన్మార్ సావిత్రి శివ జ్యోతి ఎంట్రీ ఇచ్చింది. ట్రంక్ పెట్టెతో ఎంట్రీ ఇచ్చిన శివ జ్యోతి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ కంటెస్టంట్ గా సీరియల్ యాక్టర్ రవి కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. మంచి డ్యాన్స్ మూమెంట్ తో రవి కృష్ణ స్టేజ్ మీదకు రాగా నాగార్జున అతన్ని హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 
మూడవ కంటెస్టంట్ గా అషు రెడ్డి సోషల్ మీడియా సెలబ్రిటీని ఎంపిక చేశారు.       




మరింత సమాచారం తెలుసుకోండి: