హీరో నితిన్ కథానాయకుడిగా  వచ్చిన  ఫుల్ ఎంటర్ టైనర్  'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే'.  ఈ సినిమాతో  హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు కొండా విజయ్ కుమార్.  ఆ హిట్ కారణంగానే  'ఒక లైలా కోసం' సినిమాకి  నాగచైతన్య పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడు.  అయినా  కొండా విజయ్ కుమార్ మాత్రం  చైతుకి  ప్లాప్ చిత్రాన్నే  ముట్ట చెప్పాడు.  మళ్లీ  చాలా గ్యాప్ తరువాత  రాజ్‌ తరుణ్‌ హీరోగా  కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఎట్టకేలకూ ఓ సినిమా చేస్తున్నాడు కొండా.  కాగా ఈ చిత్రం కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతూ  మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో  సినిమాలో ఫుల్  కామెడీని పండిస్తుందట.  ఒకవిధంగా  'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' సినిమాలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అదే ఫార్ములాని ఈ డైరెక్టర్ మళ్ళీ ఫాలో అవ్వబోతున్నాడు.   


ఎలాగూ రాజ్ తరుణ్ కి మంచి టైమింగ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలో 'కామిక్ వే'లో సాగే స్క్రీన్ ప్లేతో.. తన సినిమాలో  కామెడీనే హైలెట్ గా నిలిచేలా  చూసుకుంటున్నాడట ఈ డైరెక్టర్. మెయిన్ గా  లవ్ స్టోరీ  ఫుల్ ఫన్ తో వైవిధ్యంగా  ఉంటుందట. గాలికి తిరిగే ఓ కుర్రాడు  తన కన్నా వయసులో పెద్దదైన  ఓ అమ్మాయిని ఇష్టపడితే.. ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాలు ఏమిటి ?  ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో అతను ఏమి చేశాడు ? ఇలా  ముదురు భామతో సాగే ప్రేమతో   సినిమా  చాల బాగుంటుందట.   అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న  ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌ స్టాప్‌ గా షూటింగ్‌ జరుపుకోనుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: