'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా  'భీష్మ'  చిత్రం ప్రస్తుతం శరవేగంగా  తెరకెక్కుతుంది. అయితే  ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని..  ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలోనే  హైలెట్ గా  నిలవబోతుందని  తెలుస్తోంది.  మొత్తానికి వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా  ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట.  ఇక  ఈ సినిమాలో  ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.  కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర  బాగా బోల్డ్ గా  ఉంటుందట.  హెబ్బా - నితిన్ రొమాన్స్ కూడా సినిమాలో హైలెట్ నిలుస్తోందని చెబుతుంది చిత్రబృందం.  


అయితే ఈ మధ్య ఛాన్స్ లు  లేక కష్టాల్లో పడిన  హెబ్బాకి  ఈ సినిమాతోనైనా  ఆమె ఆశించిన బ్రేక్,  ఆమెకు దక్కుతుందేమో చూడాలి. అలాగే నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు.  ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో  నితిన్ సరసన మెయిన్  హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్,  'భీష్మ'తో పాటు   వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ  అలాగే  విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ   ఓ సినిమా చేస్తున్నాడు.  మరి ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వీళ్లను  'భీష్మ' ఏమి చేస్తాడో  ?   


మరింత సమాచారం తెలుసుకోండి: