ఉత్కంఠకు తెరపడింది.. ఊహాగానాలకు పుల్ స్టాప్ పడింది. బిగ్ బాస్ 3 ప్రోగ్రామ్ ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లోకి మొత్తం 15 మందిని ఆహ్వానించారు. బిగ్ బాస్ గా నాగార్జున యాంకరింగ్ తొలిరోజు పర్వాలేదనిపించుకుంది.


ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే వారి జాబితాపై కొన్నాళ్లుగా అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫైనల్ గా నాగార్జున ద్వారా ఆహ్వానం అందుకుని బిగ్ బాగ్ ఇంట్లో అడుగుపెట్టిన వారి జాబితా ఇలా ఉంది


బిగ్ బాస్ లో అడుగుపెట్టిన వారిలో ఇద్దరు టీవీ న్యూస్ యాంకర్లు ఉన్నారు.. తీన్మార్ సావిత్రిగా పేరున్న శివజ్యోది, టీవీ9 రిపోర్టర్ జాఫర్ బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. నటుడు వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా కూడా బిగ్ బాస్ లో అడుగుపెట్టారు.


ఇదిగో జాబితా


శివజ్యోతి (తీన్మార్ సావిత్రి)

రవికృష్ణ (టీవీ నటుడు)

ఆషు రెడ్డి (డబ్ స్మాష్ ఆర్టిస్ట్)

జాఫర్ (టీవీ9 రిపోర్టర్)

హిమజ (టీవీ నటి)

రాహుల్ సిప్లిగంజ్ (గాయకుడు)

రోహిణి (టీవీ నటి)

బాబా భాస్కర్ (కొరియోగ్రాఫర్)

పునర్నవి భూపాలం (నటి)

హేమ (నటి)

అలీ రజా (టీవీ నటుడు)

మహేశ్ (కామెడీ ఆర్టిస్ట్)

శ్రీముఖి (యాంకర్)

వరుణ్ సందేశ్ (నటుడు)

వితికా షేరు (వరుణ్ సందేశ్ అర్ధాంగి)


మరింత సమాచారం తెలుసుకోండి: