గాయని సునీత.. ఈవేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావో అంటూ గాయనిగా కెరీర్ మొదలు పెట్టిన సింగర్ సునీత చూస్తూనే పాతికేళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్నారు. అనేక సుమధుర గీతాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.


గాయనిగా ఆమె 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 4న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఓ మ్యూజికల్ షోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన పాతికేళ్ల సినీప్రస్థానాన్ని అవలోకనం చేసుకున్నారు. గాయనిగా నిలదొక్కుకునేందుకు పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.


గాయనిగా పాతికేళ్లు పూర్తి చేసుకోవడం అంటే మాటలు కాదు. మరి ఈ ఫీట్ సునీత ఎలా సాధించారు.. ఈ సక్సస్ సీక్రెట్ ను బయటపెట్టారు గాయని సునీత. జీవితంలో ఏదీ కూడా తనకు అంత తేలికగా రాలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.


మొదట్లో అవకాశాలు సులువుగానే వచ్చినా.. వాటిని నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే అయిందన్నారు. కష్టపడటం ఒక్కటే తన సక్సస్ సీక్రట్ అంటూ కొత్తగా సినీరంగానికి వచ్చేవారికి సందేశం ఇచ్చారు సునీత.


మరింత సమాచారం తెలుసుకోండి: