కొన్నాళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 మొదలైంది. అసలే బిగ్ బాస్ ఒకే ఇంట్లో 15 మంది, ఏ రిలేషన్ లేకుండా ఉంటేనే అక్కడ కొత్త రిలేషన్ మొదలవుతుంది.. మరి అలాంటి బిగ్ బాస్ హౌజ్ లో భార్యాభర్తలు వెళ్తే. 


అదేంటి విచిత్రంగా ఉంది కదా అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 3లో అదే జరిగింది. చివరి కంటెస్టంట్స్ గా వరుణ్ సందేశ్, వితిక ఇద్దరు జంటగా హౌజ్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లు అలా ఎంటర్ అవడం చూసి ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. వరుణ్ సందేశ్, వితిక ఇద్దరు రియల్ లైఫ్ కపుల్స్. మరి అలాంటి వాళ్లిద్దరిని బిగ్ బాస్ కు ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియాల్సి ఉంది.


ఇంక ఎవరు దొరకనట్టు ఆ కపుల్స్ నే ఎందుకు సెలెక్ట్ చేశారో కారణం మాత్రం తెలియదు. ఇక వీళ్లిద్దరి హౌజ్ ఎంట్రీ చూసి బిగ్ బాస్ హౌజ్ లో సరదాగా గడిపేస్తారని అంటున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉంటేనే ఆట రసవత్తరంగా ఉంటుంది. మరి భార్యాభర్తలను ఒకే ఇంట్లో పెట్టి బిగ్ బాస్ ఏం చేద్దామని అనుకున్నాడో ఏమో చూడాలి. 


జరిగిన రెండు సీజన్ల బిగ్ బాస్ కంటెస్టంట్స్ కన్నా ఈసారి సెలబ్రిటీస్ సంఖ్య ఎక్కువగా ఉంది. అంతకుముందు లీకైన కొన్ని పేర్లు ఉన్నా ఫైనల్ గా మాత్రం బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ తో సర్ ప్రైజ్ చేసింది. నాగార్జున హోస్టింగ్ కూడా బాగానే ఉంది. మొదటిరోజు పెద్దగా టైం దొరకలేదు కాబట్టి అంతా కంగారుగా హోస్ట్ చేసినట్టు అనిపిస్తుంది.
          


మరింత సమాచారం తెలుసుకోండి: