సున్నితమైన ప్రేమ కథా చిత్రాలను తీసే దర్శకుడు పరశురామ్ సూపర్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడట. మొదటి సినిమా "సోలో" నుండి గీత గోవిందం వరకూ ప్రేమ కథా చిత్రాలనే నమ్ముకున్నాడు. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విజయ దేవరకొండతో తీసిన గీత గోవిందం సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళు సాధించింది. సుమారు  ఎనభై కోట్లు వసూలు చేసి పరశురామ్ కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది.


గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ నిచ్చిన పరశురామ్ తర్వాతి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పరశురామ్ తర్వాతి  సినిమాను సూపర్ స్టార్ మహేష తో చేస్తున్నాడట. మహేష్ కి కథ కూడా వినిపించాడట. స్క్రిప్ట్ ఆసక్తిగా ఉండడంతో సినిమా చెయ్యడానికి మహేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. గతంలో చాలా సార్లు కొరటాల శివ తనకి నిర్మాణంపై ఆసక్తి ఉందని చెప్పిన విషయం తెలిసిందే. అదీ గాక కొరటాల శివ అంటే మహేష్ బాబుకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో "శ్రీమంతుడు" ,భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.

అయితే మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు" సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది.ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే మహేష్- పరశురామ్ కాంబినేషన్ లో సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: