ఎన్నో రోజుల నుండి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున సీజన్3 షో హోస్ట్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3లో తీన్మార్ సావిత్రి, సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ, డబ్ స్మాష్ స్టార్ అషు రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ హిమజ, టీవీ9 జర్నలిస్ట్ జాఫర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ ఆర్టిస్ట్ రోహిణి, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సీరియల్ ఆర్టిస్ట్ అలీ రేజా, సినిమా ఆర్టిస్ట్ హేమ, ఫన్ బకెట్ మహేశ్ విట్టా, హీరో వరుణ్ సందేశ్ అతని భార్య వితికా షేరు, యాంకర్ శ్రీముఖి పాల్గొన్నారు. 
 
షోలో పాల్గొన్న సెలబ్రిటీల్లో తీన్మార్ సావిత్రి(శివజ్యోతి) బిగ్ బాస్ షోకు ట్రంక్ పెట్టెతో ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో ఇచ్చే మంచి, చెడు ఙాపకాలన్నీ ఈ ట్రంక్ పెట్టెలో తీసుకెళ్తానని నాగార్జునతో చెప్పింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెద్దపులి, లై మూవీలోని బొంబాట్ పాటలు పాడి ఆకట్టుకున్నాడు. టీవీ ఆర్టిస్ట్ రోహిణి నాగార్జునను ఇమిటేట్ చేసింది. యాంకర్ శ్రీముఖి టీవీ అవకాశాలతో బిజీగా ఉన్నప్పటికీ తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని అందుకే ఈ షోలో పాల్గొంటున్నానని చెప్పింది. 
 
ఇప్పటికే స్టార్ మా ఛానెళ్ళో మీలో ఎవరు కోటీశ్వరుడు షోను బ్లాక్ బస్టర్ చేసిన నాగార్జున బిగ్ బాస్ షోను కూడా ఆసక్తితో నడిపించాడు. కానీ నాగార్జున ఇంకా బెటర్ గా చేయగలడని కొన్ని సందర్భాల్లో హడావిడి చేసాడని విమర్శలొస్తున్నాయి. ఈ సారి ఎక్కువగా ప్రేక్షకులకు పరిచయం ఉన్న సెలబ్రిటీలే ఉండటంతో సీజన్1 , సీజన్2 లను మించి సీజన్ 3 హిట్టయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 1 మొదటి ఎపిసోడ్ మాత్రం సూపర్ హిట్ అయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: