"ఫుగ్లీ" సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన భామ కియారా అద్వాని. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ విమర్శకుల మెప్పు పొందింది. ఈ సినిమా ద్వారా ఈమెకి అంతగా పేరు రాలేదు. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన "ధోనీ అన్ టోల్డ్ స్టోరీ" సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతొ భరత్ అనే నేను సినిమాలో నటించింది.


ఇటు తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ మొన్న వచ్చిన "కబీర్ సింగ్" విజయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దాదాపు రెండు వందల యాభై కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం కియారా అద్వానీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ లో  కియారాకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఆనందంలో ఒకానొక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.


ప్రేమ, పెళ్ళి గురించి అడగగా, పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా ప్రేమించే చేసుకుంటానని చెప్పింది. అంతే కాదు కియారా తన పదవ తరగతిలోనే ప్రేమలో పడిందట. పదవ తరగతి చదివేటప్పుడే ఒక అబ్బాయిని చూసి ఆకర్షితురాలయ్యిందట. అయితే ఆ విషయం అమ్మకి తెలిసి, ముందు చదువు మీద దృష్టి పెట్టు. ఈ వయసులో ఇవన్నీ సహజమే అని చెప్పిందట.


ఆ తర్వాత చదువు మీద ధ్యాసతో ఆ అబ్బాయిని మర్చిపోయిందట. ఇంకా ప్రేమ గురించి ఈ విధంగా చెప్పింది. నాకు ప్రేమ మీద చాలా గౌరవం ఉంది. మా అమ్మా నాన్నలది కూడా ప్రేమ వివాహమే. వాళ్ళని చూస్తూ పెరిగాను. వాళ్ళ అనుబంధం చూస్తుంటే నాకు కూడా ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తుంది. తప్పకుండా ప్రేమించే పెళ్ళి చేసుకుంటా. కానీ అదెప్పుడన్నది చెప్పలేను అని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: