ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు పూరి జగన్నాధ్. అయితే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత హిట్‌ను చూడడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మధ్యే తన గురువు రాంగోపాల్ వర్మతో కలిసి ఈ సినిమా సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. 


ఈ మధ్య పూరీ జగన్నాథ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ ప్రవర్తనపై సంచలన విషయాలను బయట పెట్టారు. దీంతో పూరీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. 


ఎవరూ చెప్పలేని మేటర్ ఒకటి చెబుతాన్న పూరీ ‘‘హీరోయిన్స్ పబ్లిక్‌లోకి వెళ్తే పట్టుకుని లాగేస్తారు.. నొక్కేస్తారు.. బట్టలు చింపేస్తారు.. ఇవన్నీ చేస్తారని మీకు తెలుసు. హీరోలు బయటకెళ్లినా అలాగే చేస్తారని మీకు తెలుసా..? హీరోల బాల్స్ పట్టుకుని నొక్కేస్తారు. అది కూడా మగవాళ్లే. ప్రతీ హీరోకు ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ, ఎవరూ బయటకు చెప్పలేదు'' చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: