సూపర్ స్టార్ మహేష్ తో సినిమాలు చేసే అవకాశం ఏనిర్మాతకు వచ్చినా అది వదులుకోరు. అయితే అలాంటి అవకాశం మరొకసారి దిల్ రాజ్ కు వచ్చినా అతడు ఆసక్తి కనపరచడంలేదు అని వస్తున్న వార్తలు ఎవరికీ నమ్మశక్యం కాని న్యూస్ గా మారింది. ప్రస్తుతం మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని తీస్తున్న దిల్ రాజ్ కు మరొకసారి మహేష్ తోనే చేసే సినిమా అవకాశం వచ్చినా ఆ అవకాశం వద్దు అనుకుంటున్నట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘మహర్షి’ ఇచ్చిన ఆనందంతో వంశీ పైడి పల్లికి మరో చాన్స్ ఇస్తున్న మహేష్ ఈమూవీని కూడ పివిపి నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించమని దిల్ రాజ్ కు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సూచనకు దిల్ రాజ్ మహేష్ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

దీనికి కారణం మహేష్ సినిమాలకు పెరిగిపోతున్న బడ్జెట్ అని అంటున్నారు. ‘మహర్షి’ సక్సస్ అయినప్పటికీ ఆమూవీని ముగ్గురు నిర్మాతలతో కలిసి దిల్ రాజ్ నిర్మించడంతో ఆమూవీతో తనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అని బాధ పడుతున్నట్లు టాక్. ప్రస్థుతం నిర్మాణంలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ బడ్జెట్ కూడ రోజురోజుకు బాగా పెరిగిపోవడం దిల్ రాజ్ ను కలవర పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ఇంకా పూర్తిగా మార్కెట్ కాకుండానే మరో సినిమా మహేష్ తో తీసే అవకాసం వచ్చిన పరిస్థితులలో ఈమధ్య దిల్ రాజ్ వ్యక్తిగతంగా మహేష్ దగ్గరకు వెళ్లి ఒక షాకింగ్ సమాధానం ఇచ్చాడు అన్న గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. 

మహేష్ ఒక సినిమాలో నటించినందుకు తన పారితోషికానికి బదులు నాన్ ధియేటర్ హక్కులు తీసుకుంటున్న విషయాన్ని సున్నితంగా గుర్తుకు చేస్తూ దర్శకుడుకు భారీ పారితోషికం అదేవిధంగా సినిమాలలో నటించిన హీరోయిన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు భారీ పారితోషికాలు అందుతున్నాయన్న విషయాన్ని దిల్ రాజ్ మహేష్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. దీనితో నిర్మాతగా కూడ తాను పారితోషికం తీసుకుంటే బాగుంటుందా అన్న ఆలోచనలు వస్తున్నాయని దిల్ రాజ్ మహేష్ తో అన్నట్లు తెలుస్తోంది. దీనితో దిల్ రాజ్ నోటివెంట వచ్చిన ఆమాటలకు షాక్ అయి తనపారితోషికం తగ్గించుకోమని దిల్ రాజ్ పరోక్షంగా సూచించాడా అంటూ మహేష్ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: