పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే.ఈ సినిమాకు నాలుగు రోజుల్లో 18 కోట్ల దాకా కలెక్షన్లు వచ్చాయి. నైజాం మరికొన్ని ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఇవెన్ అయింది. 16 కోట్ల రుపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్మితే 18 కోట్ల రుపాయల వసూళ్ళు ఇప్పటికే సాధించింది ఈ సినిమా. రుపాయి పెట్టుబడికి రెండు రుపాయల లాభం అందించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. ఈ సినిమా హిట్టవ్వటంతో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. 
 
నిజానికి ఇస్మార్ట్ శంకర్ కథ రామ్ ను ఉద్దేశించి రాసింది కాదట. పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ తో మెహబూబా అనే సినిమా తీసాడు. కానీ ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. తన కొడుకైన ఆకాశ్ కు ఎలాగైన హిట్టివ్వాలని పూరీ ఈ కథను రాశాడట. కానీ ఇంత చిన్న వయసులో ఆకాశ్ ఇంత హెవీ క్యారక్టర్లు మంచిది కాదని పూరీ జగన్నాథ్ సన్నిహితులు సూచించటంతో కొన్ని మార్పులు చేసి ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ తో తీసాడట పూరీ జగన్నాథ్. 
 
ఒకవేళ పూరీ జగన్నాథ్ ఆకాశ్ తో తీసి ఉంటే మాత్రం ఈ సినిమా ఇంత పెద్ద హిట్టైతే అయ్యేది కాదు. ఇస్మార్ట్ శంకర్ పాత్రకు రామ్ నూటికి నూరు శాతం న్యాయం చేసాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్టవ్వడంతో రామ్, పూరీ జగన్నాథ్ కొంతకాలం రెస్ట్ తీసుకుని కొత్త సినిమా ప్రాజెక్టుల్లో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా హిట్టవ్వడంతో నభా నటేశ్, నిధి అగర్వాల్ ఇద్దరికీ కొత్త సినిమా ఆఫర్లు వస్తునట్లు సమాచారం. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: