టాలీవుడ్ లోకి విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో రొమాంటిక్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే.  నాగార్జున కూడా ఎక్కువగా లవ్, రొమాంటిక్ మూవీస్ లోనే ఎక్కువగా నటించారు.  అందుకే ఆయను సినీ పరిశ్రమలో మన్మథుడు అని అంటారు.  ప్రస్తుతం నాగార్జున యంగ్ డైరెక్టర్, నటుడు రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మథుడు2’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ మూవీ మన్మథుడు కి సీక్వెల్.

మన్మథుడు 2 ఆగష్టు 9న విడుదలకు సిద్ధం అవుతోంది.  విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసింది.  ఈ నేపథ్యంలో  చిత్ర యూనిట్ మన్మథుడు 2లోని తొలి పాటని విడుదల చేశారు. 'హే మానియా' అంటూ సాగే ఈ పాట ట్రెండీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో నాగార్జున్ 25 ఏళ్ల మన్మథుడిలా కనిపిస్తున్నారు..స్టైలిష్ కాస్ట్యూమ్స్..ట్రెండీ లుకింగ్ ఒక ఎత్తైతే హాలీవుడ్ బ్యూటీస్ తో తెగ రొమాన్స్ చేస్తున్నారు.

ఈ పాట మద్యలో వెన్నెల కిషోర్ అయినా అంత ఫాస్ట్ గా ఎలా పడేస్తారు సార్ అమ్మాయిల్ని అంటే పడేయడటం ఏంట్రా ఆ మాటంటేనే అసహ్యం అని అంటారు నాగార్జున.  రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగార్జున, రకుల్ పాత్రలని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: