ఫాంటలూన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సైమా అవార్డుల ప్రధానోత్సవం రెడీ అయిపోతుంది. ఆగస్టు 15 16 వ తారీఖున ఈ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడానికి ఫాంటలూన్స్ సంస్థ స్పాన్సర్ చేస్తోంది. ఇది ఎనిమిదవ సైమా వేడుకలు. ఈ సందర్భంగా ఈ వేడుక వివరాలను ఉద్దేశించి తెలియజేస్తూ ఫాంటలూన్స్ సంస్థ మీడియా సమావేశం నిర్వహించింది.


జరిగిన ఈ మీడియా సమావేశానికి హీరోయిన్ శ్రీయ శరన్. సుధీర్ బాబు, రుహాని శర్మ, నిధి అగర్వాల్, ఫాంటలూన్స్ మార్కెటింగ్ హెడ్ ర్యాన్ పాల్గొన్నారు. సౌత్ ఇండియా సినీ తరాల సమక్షంలో వైభవంగా సైమా అవార్డ్స్ జరగబోతున్నాయి. ఈ సారి సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన చిత్రాల మధ్య మంచి పోటీ నెలకొని ఉంది. తెలుగులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం టాప్ లో కొనసాగుతోంది.


ఈ చిత్రానికి మహానటి గట్టి పోటీ ఇస్తోంది. ఇక తమిళంలో త్రిష నటించిన 96 టాప్ లో ఉంది. కన్నడలో కేజీఎఫ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలుగులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన చిత్రాలు : 

1. రంగస్థలం - 12 నామినేషన్స్ 

2. మహానటి - 9 నామినేషన్స్ 

3. గీతా గోవిందం - 8 నామినేషన్స్ 

4. అరవింద సమేత - 6 నామినేషన్స్

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: