టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేస్తారని, అలానే అయన కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా చేసే అవకాశం ఉందని ఇటీవల పలు వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారితో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని, అయితే కథ మాత్రం ఇంకా సిద్ధం కాలేదని చెప్పుకొచ్చారు. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఎన్టీఆర్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. 

పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా సాగనున్న ఈ సినిమాలో కిక్ ఇచ్చే మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ని అలరించలా ఫైట్స్, యాక్షన్ సీన్స్ అదరగొడతాయట. అయితే ఈ కథ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, మరికొద్దిరోజుల్లో కథను పూర్తిగా సిద్ధం చేసి ప్రశాంత్, ఎన్టీఆర్ కు వినిపిస్తారని అంటున్నారు. ఓవైపు ప్రశాంత్ కెజిఎఫ్ 2తో అలానే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో ఫుల్ బిజీ గా ఉండడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం కూడా లేకపోలేదనేది ఆ వార్త సారాంశం. మరి ఇందులో నిజానిజాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్త ఒకవేళ నిజమే అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరొక మాస్ ట్రీట్ లభించినట్లే అని చెప్పవచ్చు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: