సూపర్ స్టార్ రజినికాంత్ క్రేజ్ మరియు ఫాలోయింగ్ చూస్తే ఎంతటివారికైనా ఆశ్చర్యం కలుగకమానదు. కేవలం తమిళనాడులో మాత్రమే కాక, మన దేశం దాటి దేశ, విదేశాల్లో ఎందరో అభిమానులు అయన అంటే విపరీతమైన ప్రేమను కలిగి ఉండడం చూస్తుంటాం. ఇక ఆయనతో సినిమా చేసే ఒక్క అవకాశం వస్తే చాలు, నిజంగా అది ఈ జన్మకు లభించే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు నటులు మరియు సాంకేతికనిపుణులు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల వరుస పరాజయాలతో కొన్నాళ్లుగా సతమతం అవుతున్న పూరి జగన్నాథ్ కు కొద్దిరోజుల క్రితం విడుదలై, 

ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో మరియు కలెక్షన్లతో దూసుకుపోతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతో జోష్ ని ఇచ్చింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక పూరి ఫ్యాన్స్ అయితే పదే పదే సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత పూరి ఎవరితో చేస్తారు అనే విషయమై కొద్దిరోజలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. తాను రాసుకున్న జనగణమణ అనే స్టోరీ లైన్ తన కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమని, అది మహేష్ బాబు తో త్వరలో చేయాలని ఉందని పూరి ఇప్పటికే పలుమార్లు ఇంటర్వూస్ లో చెప్పకనే చెప్పారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు బిజీగా ఉండడంతో ఆ సినిమాను విజయ్ దేవరకొండతో తీసే ఆలోచనలో ఉన్నారట పూరి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇకపోతే కొందరు పూరి అభిమానులు మాత్రం అయన తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీయాలని, రజిని నోట కనుక పూరి డైలాగ్స్ పలికితే, వాటికి మరింత క్రేజ్, గుర్తింపు రావడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. 

నిజానికి పూరి ఇప్పటివరకు దాదాపుగా మన స్టార్ హీరోలు అందరితో పనిచేసినప్పటికీ, రజినీతో మాత్రం పని చేసే అవకాశం రాలేదని, కాబట్టి ఇకనైనా రాబోయే రోజుల్లో పూరి కనుక రజిని గారిని కలిసి అయన ఇమేజీకి సరిపోయే మంచి స్టోరీ కనుక వినిపిస్తే బాగుంటుందని వారు అంటున్నారు. అయితే అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని, ప్రస్తుతం రజిని నటిస్తున్న దర్బార్ సినిమా తరువాత ఆయనకు మరిన్ని కమిట్మెంట్స్ ఉన్నాయని, కాబట్టి రజినీకి పూరితో కలిసి పనిచేసే ఛాన్స్ ఇప్పట్లో దొరక్కపోవచ్చని అంటున్నాయి సినిమా వర్గాలు. అయితే చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: