తెలుగు బిగ్ బాస్ 3 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ట్రేండింగ్ షో. ప్రపంచమంతా తెలుగు బిగ్ బాస్ వైపు చూస్తోంది. అంతటి ట్రేండింగ్ కి కారణం బిగ్ బాస్ నిర్వాహకులపై శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా చేసిన ఆరోపణలే. బిగ్ బాస్ ప్రారంభం కాకుండా చేసేందుకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి అన్ని విఫలమయ్యాయి. 


ఆఖరికి బిగ్ బాస్ ప్రారంభమైంది. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన ఈ రియాలిటీ షో ఆగదు, మీరు ఎన్నైనా చేసుకోండి మాకు అనవసరం అన్నట్టు షో ప్రారంభించారు. అలానే షో లో మన్మథుడు నాగార్జున మాములుగా సందడి చెయ్యలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉండబోయే ప్రతి కంటస్టెంట్ ని పరిచయం చేస్తూ ప్రేక్షకుల మొఖాల్లో నవ్వులు పూయించాడు నాగార్జున. 


ఈ నేపథ్యంలోనే నాగార్జున పద్నాలుగు, పదిహేను కంటిస్టెంట్‌గా 'వరుణ సందేశ్, అతని భార్య వితిక షేరు'ని ఆహ్వానించారు. వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకోగా అందరిని అడిగినట్టే మన్మథుడు నాగార్జున వరుణ్ సందేశ్, వితికకి కూడా ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే 'బిగ్ బాస్ లోకి ఇద్దరు కలిసి వెళ్లిన ఒకరు మాత్రమే గెలుస్తారు. 


ఒకవేళ మీలో ఒకరు వెళ్లిపోవాలంటే ఎవరు ఎవరికోసం త్యాగం చేస్తారు అని నాగార్జున అడిగితే 'వరుణ్ సందేశ్ భార్య 'వితిక' మొహమాటం లేకుండా నేను అంత కష్టపడి 'షో'లో ఆఖరి వరుకు వచ్చింటాను కాబట్టి వరుణ్ కి వెళ్లిపొమ్మని చెప్తా అని స్వార్దంగా సమాధానం చెప్పింది.' వరుణ్ సందేశ్ మాత్రం 'ఒకవేళ ఆ పరిస్థితి వస్తే తానే గెలవాలి అనుకుంట.. మాలో ఎవరు గెలిచినా ఇద్దరికీ పేరు వస్తుంది కదా' అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానానికి నాగార్జున స్పందిస్తూ నేను ఉన్న అలానే చెప్పేవాడిని అంటూ నవ్వారు. ఇది అంత చుసిన నెటిజన్లు.. ఏంటి ఆమె ఇచ్చిన సమాధానం ? వరుణ్ సందేశ్ భార్య ఇంత స్వార్ధంగా ఆలోచిస్తుంది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.          


మరింత సమాచారం తెలుసుకోండి: