తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీకి కొత్త భాష్యం చేప్పిన ‘జబర్ధస్త్’ ప్రోగామ్ కి యాంకర్ గా పనిచేస్తున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా తన సత్తా చాటుతుంది.  ఓ వైపు జబర్ధస్త్ లో యాంకర్ గా చేస్తూనే ఇతర టీవీ షోల్లో యాంకర్ గా కొనసాగుతుంది.  యాంకర్, నటిగా ప్రస్తుతం బిజీగా ఉన్న అనసూయ పై ఈ మద్య వరుసగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అంతే కాదు ఆమె ఫేక్ ఫేస్ బుక్ క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.  తాజాగా అనసూయ తన అభిమానులకు మరో విషయం వెల్లడించింది. 

నేను పనిచేస్తున్న ప్రదేశంలో నా మంచి కోరి నన్ను ఓ విషయం అడుగుతూ ఉంటారు. ‘అనసూయ.. చాలా తొందరగా పెళ్లి చేసుకున్నావ్‌. లేకపోతే టాప్‌ హీరోయిన్‌ అయిపోయేదానివి. ఎందుకు ఊరికే కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేస్తావ్‌.. ఇలా చేస్తే నీకు డిమాండ్‌ తగ్గిపోతుంది’ అని చెబుతూ ఉంటారు. అయితే వీరందరికీ నాది ఒక్కటే సమాధానం.. మనం ఒక పొజీషన్ కి వచ్చామంటే దాని వెనుక నా ఒక్క కృషి మాత్రమే కాదు నా కుటుంబం ప్రోత్సాహం కూడా ఉంది.

నేను జీవితంలో పొందిన వాటిని చూసి సిగ్గుపడటం లేదు గర్వపడుతున్నానని తెలిపింది అనసూయ. నేను పొందిన వాటిలో అన్నింటికంటే గొప్పది నా కుటుంబం. మనం రాత్రింబవళ్లు పనిచేసేది ఇంటికెళ్లాక కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతాను, అది నాకు ఎంతో తృప్తినిస్తుంది. అయినా మనం పని చేసే చోట  మగవారికి లేని హద్దులు ఆడవారికెందుకనేది నా ప్రశ్న.  నాలాగే ఆలోచించేవారితో కలిసి పనిచేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.  సమాజంలో ఇప్పుడు ఆడవారికి ఎంతో గౌరవం దక్కుతుంది..కొంత మంది పనికట్టుకొని దాన్ని బ్రస్టు పట్టిస్తున్నారే ఆవేదన ఒక్కటి మాత్రం భాద కలిగిస్తుందని అన్నారు అనసూయ. 


మరింత సమాచారం తెలుసుకోండి: