నందమూరి బాలక్రిష్ణ కొత్త చిత్రం త్వరలో సెట్స్ మీదకు రానుంది. సీ కళ్యాణ్ నిర్మాతగా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే లాంచింగ్ జరిగింది.


ఇదిలా ఉండగా ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా .. గ్యాంగ్ స్టార్ గా ఆయన రెండు పాత్రలను చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంటుందనే వార్తలు షికారు చేశాయి. ఒక కథానాయిక బోల్డ్ గా కనిపించాల్సి ఉండటంతో, పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.


అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించవలసి వుంది.  ఇక ఈ సినిమాకి 'క్రాంతి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇక మరో కధానాయికగా యంగ్ హీరోయిన్ని అనుకుంటున్నారుట. ఈ మూవీని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్ గా ఉంది. మరి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: