సాధార‌ణంగా మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద సినిమాలు ఉంటే చిన్న సినిమాలు మాములుగానే ప‌క్క‌కు త‌ప్పుకుంటాయి. లేదంటే కొంత మంది గ‌ట్స్ ఉన్న ద‌ర్శ‌కులు ఎంత పెద్ద సినిమా ఉన్నా వాటితో పాటు పోటీగా చిన్న సినిమాని కూడా విడుద‌ల చేస్తుంటారు. వీటి వ‌ల్ల కొన్ని సార్లు పెద్ద‌సినిమాలు హిట్ అవుతాయి  మ‌రికొన్ని సార్లు కంటెంట్ బావుంటే పెద్ద సినిమాల ముందు చిన్న సినిమాలు హిట్ అయిన రోజులున్నాయి. ]]


అయితే ప్ర‌స్తుతం సాహో సినిమా వాయిదా ప‌డ‌డంతో తెలుగులో ఇద్ద‌రు హీరోల‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్ల‌యింది.. గ‌తేడాది గూఢ‌చారి సినిమాతో స‌క్సెస్ సాధించిన అడవి శేషు,ఇప్పుడు  రెజీనా  హీరోయిన్ గా  `ఎవ‌రు ` సినిమా ఆగ‌ష్టు 15 న రిలీజుకు రెడీ అయింది... సాహో వాయిదాతో రెజీనాకు అడ‌వి శేషు ల‌కు త‌మ సినిమాపై  ఆశ‌లు చిగురించాయ‌నే చెప్పాలి...అలాగే  మ‌హానుభావుడు త‌రువాత హిట్ లేని శ‌ర్వానంద్ సినిమా `ర‌ణ‌రంగం` కూడా ఆగ‌ష్టు 15 నే రిలీజు కు సిద్ధ‌మ‌య్యింది.. సాహో ఆగ‌ష్టు 15 న రాక‌పోయేస‌రికి బాలీవుడ్ మాట అటుంచితే టాలీవుడ్ లో అయితే ఇద్ద‌రు అప్‌క‌మింగ్ హీరోల సినిమాల‌కు పూర్తిస్థాయిలో థియేట‌ర్లు ల‌భించ‌గ‌ల‌వ‌నే న‌మ్మ‌కం కుదిరింది..అడివి శేషు, శ‌ర్వానంద్ ఇద్ద‌రూ కొత్త‌త‌ర‌హా క‌థ‌ల‌కోసం ప‌రిత‌పించేవారే..ఇద్ద‌రు విభిన్న‌క‌థానాయ‌కుల సినిమాలు ఒకే రోజు  తెలుగ‌నాట‌ అద్రుష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి...


మరింత సమాచారం తెలుసుకోండి: